Select Location
All Locations
State
Region
City / District
మనుషులకు మిగిలింది 3 ఏళ్లే: నిశ్శబ్ద AI సామ్రాజ్యంపై గూగుల్ మాజీ బిజినెస్ చీఫ్ కామెంట్స్!

మనుషులకు మిగిలింది 3 ఏళ్లే: నిశ్శబ్ద AI సామ్రాజ్యంపై గూగుల్ మాజీ బిజినెస్ చీఫ్ కామెంట్స్!

ఉదయాన్నే లేచింది మొదలు ఈమెయిల్స్ రాయడం, డాక్యుమెంట్లు చెక్ చేయడం, ట్రావెల్ ప్లాన్స్ వేసుకోవడం.. ఇలా ప్రతి చిన్న విషయానికి చాట్‌జీపీటీ, జెమిని, క్లాడ్, గ్రోక్ వంటి ఏఐ టూల్స్‌ను వాడేస్తున్నాం. అబ్బా.. ఏఐ ఎంత అద్భుతంగా పనిచేస్తోందో కదా అని మురిసిపోతున్నాం. అసలు సినిమా ఇంకా ముందుంది.. మనం ఇప్పుడు చూస్తున్నది కేవలం సముద్రంలో కాకిరెట్ట లాంటి చిన్న భాగం మాత్రమేనని హెచ్చరిస్తున్నారు గూగుల్ ఎక్స్ మాజీ బిజినెస్ చీఫ్ మో గవ్‌దత్. రానున్న 3 ఏళ్లలో అంటే 2027 నాటికి ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ పూర్తి స్థాయిలో ప్రపంచాన్ని చుట్టేస్తుందని.. ఆ తర్వాత మానవ సమాజం, ఉద్యోగాలు, పరిశ్రమలు పూర్తిగా తలకిందులు కావడం ఖాయమని బాంబు పేల్చారు. ఆయన వెల్లడించిన విషయాలు వింటే ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టాల్సిందే.

ప్రజలు ఏఐని కేవలం చాట్‌బాట్లు, వైరల్ వీడియోల రూపంలోనే చూస్తూ మురిసిపోతున్నారని గవ్‌దత్ అన్నారు. కానీ టెక్ కంపెనీల సీక్రెట్ రీసెర్చ్ ల్యాబ్‌లలో జరుగుతున్న పరిణామాలు చాలా భయంకరంగా ఉన్నాయట. అక్కడి ఏఐ సిస్టమ్స్ తమ కోడింగ్‌ను తామే స్వయంగా సరిదిద్దుకుంటూ.. సరికొత్త అప్‌డేటెడ్ వెర్షన్లను క్షణాల వ్యవధిలో క్రియేట్ చేసుకుంటున్నాయని చెప్పారు. ల్యాబ్ లోపల టెక్ నిపుణులు చూస్తున్న ఏఐ ఇంటెలిజెన్స్ నమ్మశక్యం కాని స్థాయిలో ఉందని.. బయట ప్రపంచంలో జరుగుతున్న హడావుడి వేరు, లోపల సైంటిస్టుల గదిలో ఉన్న నిశ్శబ్దం వేరు.. ఆ నిశ్శబ్దమే చాలా ప్రమాదకరమైనదని అన్నారు. ఏఐ సాంకేతికత కంటే కూడా, దాన్ని నియంత్రించే పవర్‌ఫుల్ కంపెనీలు, ప్రభుత్వాలు దాన్ని ఎలా వాడుకుంటాయనేదే అసలైన ముప్పని స్పష్టం చేశారు.

Source : V6 News

1 hour ago

Home Flash News