Select Location
All Locations
State
Region
City / District
టెంపుల్ బాండ్స్ తెస్తున్న మధ్యప్రదేశ్.. భక్తులిచ్చే కానుకలతోనే ఇన్వెస్టర్లు రీపేమెంట్స్ చేస్తారంట!

టెంపుల్ బాండ్స్ తెస్తున్న మధ్యప్రదేశ్.. భక్తులిచ్చే కానుకలతోనే ఇన్వెస్టర్లు రీపేమెంట్స్ చేస్తారంట!

దేశంలోనే తొలిసారిగా మధ్యప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం ఒక సరికొత్త సంచలనానికి తెరలేపింది. భక్తి మార్గాన్ని సరికొత్త ఫైనాన్స్ వ్యూహంగా మార్చుకోవాలని చూస్తోంది. ఆధ్యాత్మికతను, ఆధునిక ఫైనాన్స్ రంగాన్ని జోడిస్తూ దేశంలోనే మొదటిసారిగా "టెంపుల్ బాండ్స్" తీసుకురావాలని నిర్ణయించింది. ఉజ్జయిని దాని చుట్టుపక్కల ప్రభుత్వ ఆధీనంలోని 11 ప్రముఖ దేవాలయాల అభివృద్ధి, ఆధునీకరణ కోసం ఈ వినూత్న బాండ్లను జారీ చేయనున్నారు. రూ.11వందల కోట్ల భారీ ఆలయ అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా.. మొదటి విడతగా రూ.200 కోట్లు సేకరించాలని బీజేపీ సర్కార్ ప్లాన్ చేస్తోంది.

సాంకేతికంగా చెప్పాలంటే ఇవి మునిసిపల్ బాండ్ల తరహాలోనే ఉంటాయి. ఈ బాండ్లను రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన ‘ఉజ్జయిని డెవలప్‌మెంట్ అథారిటీ’ జారీ చేస్తుంది. ఇందుకోసం 11 ఆలయ కమిటీలతో ప్రత్యేక ఒప్పందాలను కుదుర్చుకుంటుంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన అర్బన్ ఛాలెంజ్ ఫండ్, బ్యాంక్ లోన్ల సహాయంతో ఈ ఆలయాల పునర్నిర్మాణం జరుగుతుంది. ఉజ్జయినిలోని చాలా దేవాలయాలు ప్రైవేట్ ట్రస్ట్‌లు కావు, ఇవన్నీ ప్రభుత్వ పర్యవేక్షణలో ఉండేవే. వీటి మేనేజ్‌మెంట్‌లో ఆయా ప్రాంతాల ఎస్డీఎంలు, తహసీల్దార్లు ఉంటారు కాబట్టి నిధుల దుర్వినియోగం జరిగే అవకాశం ఉండదని ప్రభుత్వం భావిస్తోంది.

Source : V6 News

1 hour ago

Home Flash News